యడ్యూరప్పను, గాలిని రక్షించే చర్యలు మొదలు

ముఖ్యమంత్రి, మంత్రుల ఉద్వాసనకు సిఫార్సు చేసిన లోకాయుక్త సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని సదానంద గౌడ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం అభిప్రాయపడింది. నివేదికను తిరిగి లోకాయుక్తకు పంపాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేను లేదా మంత్రిని తప్పించాలని సూచించడం పౌర మృతికి ఆదేశించడం వంటిదని సమావేశానంతరం న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎస్ సురేష్ కుమార్ మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను తప్పు పట్టిన వ్యక్తులను విచారించకుండానే లోకాయుక్త నివేదిక సమర్పించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications