తెలంగాణ కోసం జైలుకెళ్లేందుకు సిద్ధం: గుత్తా

హైదరాబాదులో విశాలాంధ్ర మహాసభకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. విశాలాంధ్ర పేరుతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్ట వద్దని కోరారు. అనుమతి నిరాకరించడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామన్నారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఏం చేయాలో అందరం చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకు వస్తున్నామన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు విభజన ఎందుకు వద్దో కారణం చెప్పడం లేదన్నారు. వారు తమ అభ్యంతరాలను స్పష్టంగా చెప్పాలన్నారు. ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications