సీమాంధ్ర నేతలకు సిగ్గు లేదు: కేశవరావు కామెంట్

K Keshav Rao
న్యూఢిల్లీ: తెలంగాణను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర నేతలపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం చేస్తున్న స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీకి ఆయన బుధవారం సంఘీభావం ప్రకటించారు. దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఇస్తే నష్టమేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నష్టమేమిటో చెప్తే తాను తెలంగాణ ఉద్యమం నుంచి బయటకు వస్తానిని ఆయన అన్నారు. తెలంగాణపై రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చే వరకు తాను ఏ పదవీ చేపట్టబోనని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణకు సీమాంధ్ర నేతలు ఎందుకు అడ్డు పడుతున్నారని, సిగ్గు లేదా అని ఆయన సిమాంధ్ర నేతలను అడిగారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హింస జరగవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కోసం ఎవరితోనైనా కలుస్తామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవడం త్యాగం కాదని ఆయన అన్నారు. దేశంలో 1956 తర్వాత 17 రాష్ట్రాలు ఏర్పడ్డాయని, వాటికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, తెలంగాణ విషయంలోనే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ఆయన అన్నారు. ఆ రాష్ట్రాలు ఇచ్చేప్పుడు జరగని జాప్యం తెలంగాణ విషయంలోనే ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+