జగన్ ఎప్పుడూ వెళ్లలేదు: రోజా, ఎల్లో మీడియాపై ధ్వజం

Roja
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్‌ను తమ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సందర్శించలేదని అలాంటప్పుడు ఆయనను ఎలా విచారిస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రోజా శుక్రవారం ఓ ఛానల్ కార్యక్రమంలో ప్రశ్నించారు. గాలిని ఇంట్రడ్యూస్ చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఓఎంసిని సందర్శించిన వారిని వదిలేసి జగన్‌ను విచారించడమేమిటన్నారు. అధికారంలో ఉన్నారని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ఇంటికి వెళ్లి విచారించి, జగన్‌ను మాత్రం పిలిపించి విచారిస్తున్నారని ఆరోపించారు. ఎల్లో మీడియా విషయాలు విని జగన్‌ను విచారణకు పిలవడం దారుణమన్నారు.

ఎల్లో మీడియా, కాంగ్రెసు అనవసరంగా జగన్ అభిమానులను రెచ్చగొట్టవద్దన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే ఎన్నికలకు సిద్ధం కావాలని అప్పుడు జగన్ బలమెంతో తెలుస్తుందన్నారు. తమ నేతను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఎల్లో మీడియా గందర గోళ సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. సరైన సమాచారం ఉంటేనే చెప్పాలని సూచించారు. దివంగత వైయస్ చరిష్మాతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు ఆయన మరణం తర్వాత ఆయనను క్రిమినల్‌గా చూపిస్తున్నారన్నారు. జగన్ పార్టీ వీడి బయటకు వెళ్లిన తర్వాత ఉద్దేశ్య పూర్వకంగా ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. వేధింపులతో జగన్‌పై ప్రజలకు అభిమానం రెట్టింపవుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+