వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు అవిశ్వాస తీర్మానంపై జగన్ సాక్షి విసుర్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sakshi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతల అవిశ్వాస తీర్మానం ఓ బూటకమంటూ పేర్కొంది. రాష్ట్ర సర్కారును కాపడటానికి, అదే సమయంలో రాజకీయంగా పబ్బం గడుపుకుంటూ బాబుపై సిబిఐ విచారణను నెమ్మదింప చేయడానికి టిడిపి అవిశ్వాస తీర్మానమంటోందని ఆరోపించింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే మద్దతిస్తామని ప్రతిపక్షాలు ముందుకొచ్చినప్పటికీ బాబు మాత్రం ఏదో రకంగా అవిశ్వాస తీర్మానం పెట్టామనిపించుకొని అది చర్చకు రాకుండా చూడాలని బాబు యోచిస్తున్నారని పేర్కొంది.

గత అసెంబ్లీ సమావేశాల్లోనూ టిడిపి నిబంధనలకు విరుద్దంగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చి హడావుడి చేసి అబాసుపాలయ్యిందన్నారు. టిడిపి గత సమావేశాల్లో కావాలనే అవిశ్వాస నోటీసుల విషయంలో తప్పటడుగులు వేసి ఆ తర్వాత చావు కబురు చల్లగా చెప్పారని విమర్శించింది. అవిశ్వాసమంటూ టిడిపి నేతలు మీడియా సమావేశాల్లో బీరాలు పలుకుతున్నప్పటికీ తూతూ మంత్రపు ఎత్తుగడతో వెళ్లడానికి రంగం సిద్ధం చేశారని చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గెలవలేమని, బాబుపై సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెసు ప్రభుత్వంతో సఖ్యత చెడగొట్టకుండా తమకు అనుకూలంగా ఉపయోగించుకొవాలని టిడిపి చూస్తోందని విమర్శించింది.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy Sakshi daily accused Telugudesam Party chief Nara Chandrababu Naidu for no confidential vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X