ప్రత్యేక తెలంగాణ ఇది వరకే ప్రకటించారు: కెసిఆర్

k chandrasekhar rao
హైదరాబాద్: తెలంగాణ ఇది వరకే ప్రకటించబడిన రాష్ట్రమని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం హైదరాబాదులో అన్నారు. మంగళవారం నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన సోమవారం నుండి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ విభజన కోసం అక్కడి అసెంబ్లీ తీర్మానం చేసింది కాబట్టి ఆ రాష్ట్రాన్ని వెంటనే విభజించాలని సూచించారు. ప్రధాన మంత్రి తెలంగాణ ప్రజల
మనోభావాలను గౌరవించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రధానికి తాను మరోసారి అప్పీలు చేస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు పార్టీ భూస్థాపితం కాక తప్పదన్నారు. తెలంగాణను గతంలోనే ప్రకటించారని దానిని ఆలస్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. యుపి ముఖ్యమంత్రి మాయావతి నిర్ణయం దేశానికే ఆదర్శ ప్రాయమని, ఆమె నిర్ణయం స్వాగతిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటులో మా గళానికి బిఎస్పీ ఎంపీలు తోడవుతారన్నారు. ఢిల్లీ వెళ్లాకమాయావతిని కలుస్తానన్నారు.

మాయావతి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాదులో అన్నారు. కెటిఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెసు తీరుపై విరుచుకు పడ్డారు. మాయావతి మాదిరి సిఎం కిరణ్ కూడా తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టి కేంద్రానికి పంపించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+