తెలంగాణపై తీర్మానం చేయండి: కాంగ్రెసుకు మాయా

అనంతరం మాయావతి మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వానిది ఎన్నికల తీర్మానం కాదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే విభజన తీర్మానం చేసినట్లు చెప్పారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడమంటే మైనార్టీ, దళితుల అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు. సభలో గందరగోళ పరిస్థితికి విపక్షాలే కారణమన్నారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ అంశం పైనా స్పందించారు.
ఆంధ్ర ప్రదేశ్లో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేశారని వారి రాజీనామాలు స్పీకర్ వద్ద ఇప్పటికీ పెండింగులో ఉన్నాయని అన్నారు. ఉద్దేశ్య పూర్వకంగానే స్పీకర్ తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ కోసం ఎపి అసెంబ్లీ ఎలాంటి తీర్మానం చేయలేదని అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక రాష్ట్ర
ఏర్పాటును ఆలస్యం చేస్తోందని విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెసు తీర్మానం చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications