వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు, టిడిపిలే లక్ష్యంగా తెలంగాణ పోరు: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఆ రెండు పార్టీల నేతలపై ఒత్తిడి తేవడం ద్వారా తెలంగాణ సాధించుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశానంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి తెలంగావాదులపై కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. డిజిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, దీనిపై ఈ నెల 27వ తేదీన న్యాయవాదుల సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

ఉత్తరప్రదేశ్ విభజనకు మాయావతి ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసిన విధంగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పూనుకుని తెలంగాణ కోసం శాసనసభలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండుతో డిసెంబర్ 1వ తేదీన తెలంగాణలోని గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తన హామీని నిలబెట్టుకోనందుకు నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు లేఖ రాస్తామని ఆయన చెప్పారు. డిసెంబర్ 9వ తేదీని తెలంగాణ ఆత్మగౌరవ దినంగా పాటిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని ఆయన చెప్పారు.

English summary
Telangana JAC chairman Kodandaram said that they will target Congress and TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X