అవిశ్వాసంపై వైఖరేంటి: జగన్,కెసిఆర్లకు మోత్కుపల్లి

కెసిఆర్ కాంగ్రెసు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని విమర్శించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెండోసారి రాజీనామా ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. దళితుడైన రాజయ్యచే రాజీనామా చేయించారని ధ్వజమెత్తారు. టిఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామాల ఆమోదంపై తమకు అనుమానాలున్నాయని అన్నారు.
వచ్చే శాసనసభ సమావేశాలలో ప్రభుత్వంపై ప్రజా సమస్యల విషయంలో అవిశ్వాసం పెడతామని మరోనేత గాలి ముద్దుకృష్ణమ అన్నారు. కరవు నివారణపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. కరవుపై కేంద్రానికి ప్రభుత్వం ఒక్క నివేదిక కూడా పంపలేదని విమర్శించారు. రాజీనామాల ఆమోదంపై గల సందేహాలను స్పీకర్కు తెలిపినట్లు చెప్పారు. కరవు, రైతు సమస్యలపై చర్చించేందుకు సమయాన్ని పెంచాలని తాము స్పీకర్ను కోరినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications