ఈ వయస్సులో పిచ్చిరాతలా?: రామోజీపై వాసిరెడ్డి ఫైర్

Vasireddy Padma
హైదరాబాద్: ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు 75 ఏళ్ల వయస్సులో తన పత్రికలో పిచ్చి రాతలు రాయడం బాధాకరమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వాసిరెడ్డి పద్మ బుధవారం ధ్వజమెత్తారు. వైయస్ విజయమ్మ పిటిషన్‌పై తప్పుడు కథనాలు రాసి వాస్తవాలను వక్రీకరించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. జర్నలిజం పేరుతో ఇలా కనివినీ ఎరుగని రీతిలో ప్రజలను మోసం చేయడం ఎక్కడా చూడలేదన్నారు. శంషాబాద్ భూములకు జివో 240 విడుదలకు కారణాలేంటో మీ పత్రికలో రాయగలరా అని ప్రశ్నించారు.

రామోజీ ఏ తప్పూ చేయకపోతే సిబిఏ విచారణకు ఎందుకు భయపడుతున్నారన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ప్రచురించిన కథనాలు తప్పని రాసే దమ్ము, ధైర్యం మీకుందా అని సవాల్ విసిరారు. వైయస్ విజయమ్మ పిల్‌పై తప్పుడు రాతలు రాస్తున్న రామోజీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+