బాబుది సొల్లు, నిరూపిస్తే మేం ఉరికి సిద్దం: కెటిఆర్

KT Rama Rao
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు టెండర్లపై చేసిన ఆరోపణలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రుజువు చేస్తే తాము ఉరి వేసుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. రుజువు చేయలేకపోతే చంద్రబాబు పార్టీని రద్దు చేసుకుని, రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ఆయన సవాల్ చేశారు. పోలవరం టెండర్లపై రభస జరిగి సభ వాయిదా పడిన తర్వాత ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చంద్రబాబు రెండున్నర గంటలు సభలో సొల్లు మాట్లాడారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు అవిశ్వాస తీర్మానాన్ని తెరాసపై, తెలంగాణవాదులపై పెట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

చంద్రబాబు తమపై నిరాధారమైన, దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మాట్లాడేది సొల్లు కాకపోతే, ఆ ఆరోపణలపై ఏ విచారణ చేయించుకోవాలని ఆయన అన్నారు. ఏ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని, ఆరోపణలు రుజువైతే తాము ఉరి శిక్ష వేసుకుంటామని ఆయన అన్నారు. చంద్రబాబుకు కృష్ణ జన్మస్థానం తప్పదని, చిప్పకూడు తప్పదని ఆయన అన్నారు. సిబిఐ విచారణను ఎదుర్కోలేకనే తమపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని తెలంగాణలో భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతోనైనా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని సంస్థలతోనైనా విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. చంద్రబాబు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుది ఇప్పటికే రోడ్డు బతుకు అయిపోయిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+