వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు పెద్దలకు చిరంజీవి వర్గం నేత హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramachandraiah
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ విలీనం ద్వారా కాంగ్రెసు పార్టీలోకి వచ్చిన చిరంజీవి వర్గానికి చెందిన నాయకులు కాంగ్రెసు పెద్దలపై ఒత్తిడి పెంచే పనికి పూనుకుంటున్నట్లు అర్థమవుతోంది. కాంగ్రెసు పార్టీ నాయకత్వాన్ని చిరంజీవి వర్గానికి చెందిన నాయకుడు సి. రామచంద్రయ్య మంగళవారం హెచ్చరించారు. చిరంజీవిని పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన కాంగ్రెసు నాయకత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెసుకు ప్రజారాజ్యం పార్టీ అండదండలు ఎంత అవసరమో సోమవారంనాటి అవిశ్వాస తీర్మానం తేల్చిందని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చిరంజీవి అభిమానుల బలాన్ని తక్కువ అంచనా వేయవద్దని కూడా ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనమైన తర్వాత కింది స్థాయిలో పొరపొచ్చాలు, అపోహలు ఉండడం సహజమని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీని బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. చిరంజీవి అనుచరులు, అబిమానులు, ఓటర్లు కాంగ్రెసు పార్టీకి బలం చేకూరుస్తారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనతోనే చిరంజీవి ఒత్తిడి రాజకీయాలకు పూనుకుని, కాంగ్రెసు అధిష్టానం ద్వారా తన డిమాండ్లను సాధించుకునే ప్రయత్నం చేశారు. ఇక ముందు కూడా అదే వైఖరిని అవలంబించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు రామచంద్రయ్య మాటలను బట్టి అర్థమవుతోంది.

English summary
Chiranjeevi camp leader C Ramachandraiah has warned Congress leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X