వైయస్ జగన్‌ను తేలికగా కొట్టిపారేసిన కిరణ్ రెడ్డి

Kiran Kumar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తేలికగా కొట్టిపారేశారు. జగన్‌కు అంత సీన్ లేదని ఆయన మంత్రులతో వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన జగన్ వర్గం శాసనసభ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయన బుధవారం సీనియర్ మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రుల వద్ద జగన్ బలబాలాలపై మాట్లాడారు. వైయస్ జగన్‌పై సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

జగన్ వర్గానికి చెందిన 17 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేస్తే జరిగే ఉప ఎన్నికల్లో జయాపజయాల గురించి ఆయన ప్రస్తావించారు. జగన్ పార్టీ అభ్యర్థులు పూర్తిగా 17 సీట్లను గెలుచుకునే అవకాశాలు లేవని, జగన్ పట్ల ప్రజల్లో సానుభూతి తగ్గిందని, ఈ విషయం సర్వేలో తేలిందని ముఖ్యమంత్రి అన్నారు. తమ ప్రధాన ప్రత్యర్థులు వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలేనని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు జరిగితే 17 సీట్లను తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు గెలుచుకునే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. వైయస్సార్ కుమారుడిగా జగన్ పట్ల సానుభూతి చూపాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన 17 మంది శానససభ్యులపై అనర్హత వేటుకు చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+