సకల జనుల సమ్మె నుండి కోలుకోలేదు: సిఎం కిరణ్

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్రం ఇంకా సకల జనుల సమ్మె నుండి పూర్తిగా కోలుకోలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నారు. బుధవారం ఉదయం జూబ్హీహాల్‌లో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి నిర్ణయంలో పారదర్శకత తెస్తూ పొరపాట్లను సరిదిద్దాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. వ్యవస్థలో పారదర్శకత కోసం గత ఏడాది నుండి కృషి చేస్తున్నామన్నారు. పాలనలో కలెక్టర్లు చూపే ప్రత్యేక శ్రద్ధ, పని తీరే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు వస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మన రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని చెప్పారు. అర్హులైన వారికి పథకాలు అందేలా చూడాల్సిన అవసరముందన్నారు.

సమస్యలు ఏవైనా సమన్వయంతో ఎదుర్కోవాలన్నారు. ఉద్యోగల భర్తీకి నెలాఖరులోగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలు లంచం లేకుండా అర్హులకు చేరేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా పని చేయాలని, రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దాలని సూచించారు. మైక్రో ఫైనాన్స్ విషయంలో ముందుగా మేల్కొని ఉంటే బాగుండేదన్నారు. నీటిపారుదలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ రైతులకు సమృద్ధిగా నీరు అందించలేక పోతున్నామన్నారు. కిలో బియ్యం పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలపై కలెక్టర్లకు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+