మా వెంట వస్తే వారి వెంట: జెఏసి చైర్మన్ కోదండరామ్

తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారందరికీ అండగా ఉంటామన్నారు. తమ వెంట ఎవరు వచ్చినా పార్టీలకతీతంగా వారికి మద్దతిస్తామన్నారు. తెలంగాణ సాధన కోసం స్పష్టమైన అవగాహనతో వెళుతున్నామని, ఎన్నికలు ఉద్యమంలో అంతర్భాగమే కానీ అవే లక్ష్యం కాదన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన రోజు కాబట్టి విద్రోహ దినంగా పాటిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం తెలంగాణపై నమ్మకద్రోహం చేసింది కాబట్టే సంఘటితంగా ఆందోళనలు, ర్యాలీలకు పిలుపునిచ్చామన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
సకల జనుల సమ్మె తర్వాత నిర్ణయం రావాల్సి ఉన్నప్పటికీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాబట్టే నిర్ణయం రాలేదన్నారు. లోక్సభలో ఏకాభిప్రాయం అన్న అధికార పార్టీ సభ్యుల వ్యాఖ్యలపై స్పందించారు. ఏకాభిప్రాయం రావాల్సింది కాంగ్రెసు పార్టీలోనేనని అభిప్రాయపడ్డారు. వారి పార్టీలో ఏకాభిప్రాయం ఎప్పుడు వస్తుంది, తెలంగాణ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో తేల్చాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ వ్యాఖ్యలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్రం వెళుతోందని విమర్శించారు. తెలంగాణ విషయంలో నమ్మక ద్రోహానికి పాల్పడ్డ కాంగ్రెసుకు ప్రజలు గోరీ కట్టడం ఖాయమని మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. కాగా తెలంగాణలోని జిల్లాల్లో తెలంగాణవాదులు విద్రోహ దినం పాటించారు.












Click it and Unblock the Notifications