విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిల్లలను చంపిన సైకో అరెస్టు, పిఎస్ ఎదుట ఆందోళన

By Pratap
|
Google Oneindia TeluguNews

Visakhapatnam Map
విశాఖపట్నం: చిన్న పిల్లలను హత్య చేసిన సైకోను విశాఖపట్నం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఇద్దరు చిన్నారులను బావిలో తోసి అతను హత్య చేశాడు. అతను గత కొంత కాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎట్టకేలకు అప్పారావు అనే ఉన్మాదిని పాత గోపాలపట్నంలో పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని శుక్రవారం సాయంత్రం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. పిల్లలను తానే చంపినట్లు అతను అంగీకరించాడు. తనకు పెళ్లి కాకపోవడంతో చిన్నారులపై ఈర్ష్యతో చంపేశానని నిందితుడు అంగీకరించాడు.

మద్యం సేవించిన తర్వాత తనకు ఏదీ తెలియదని, దాంతో ఏమీ తెలియని స్థితిలో పిల్లలను హత్య చేశానని అతను చెప్పాడు. అయితే, పిల్లలను చంపిన వ్యక్తిని అరెస్టు చేశారని తెలియగానే ప్రజలు పోలీసు స్టేషనుకు వచ్చి ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన వ్యక్తిని తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పోలీసు స్టేషను ఎదుట తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

English summary
The pschyco, who killed children were arrested at Vishakahapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X