వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్, సబితలే దాడికి కారణం, చిట్టా విప్పుతా: శంకర్రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: తనపై దాడికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిలే కారణమని చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర రావు మంగళవారం ఆరోపించారు. వారిద్దరి నుండి తనకు ప్రాణహాని ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతిపరులను వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. త్వరలో అవినీతి పరుల చిట్టా విప్పుతానని వారందరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తానని హెచ్చరించారు.

హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఐదువేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నగర్‌లో ఐదు ఎకరాలు ఆక్రమించారని విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న సబితను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలు బయటపెడతారని భాను కిరణ్‌ను చంపారని అనుమానం వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్రమాలు త్వరలో బయటపెడతానన్నారు. హుడా చైర్మన్‌గా ఆయన చేసిన అక్రమాలు వెల్లడిస్తానన్నారు. తనపై దాడి విషయంలో అమాయకులను అరెస్టు చేశారన్నారు.

English summary
Minister Shankar Rao accused YS Jagan and Sabitha Indra Reddy for attack on him. He blamed Sabitha that she earned five thousand crore rupees illegally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X