వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలిసిపోతున్న అంబానీ సోదరులు, తేడాలు లేవన్న తల్లి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Mukesh and Anil
రాజ్‌కోట్: పారిశ్రామికవేత్తలు ముకేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య విభేదాలు లేవని, ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ కలిసే ఉన్నారని వారి తల్లి కోకిలాబెన్ అన్నారు. వారి తండ్రి ధీరూభాయ్ అంబానీ స్మారకం ప్రారంభ కార్యక్రమంలో వారిని కలిపేందుకు కుటుంబం అన్ని ఏర్పాట్లు చేశారు. ముకేష్, అనిల్ మధ్య ఏ విధమైన విభేదాలు లేవని, పరస్పరం చెడు భావన కూడా లేదని, రేపు వారిద్దరు కుటుంబ సభ్యులతో చోర్వాడ్‌లో కలిసి ఉంటారని ఆమె మంగళవారం అన్నారు.

ధీరూభాయ్ అంబానీ స్వంత పట్టణం చోర్వాడ్‌లో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. డిసెంబర్ 28వ తేదీన ధీరాభాయ్ అంబానీ 80వ జయంతి సందర్భంగా ఆయన మెమోరియల్‌ను ఇక్కడ ప్రారంభించనున్నారు. అంబానీ సోదరులిద్దరు దీనికి హాజరవుతారని భావిస్తున్నారు. ఇది తమ కుటుంబ కార్యక్రమమని, ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులంతా వస్తారని కోకిలా బెన్ అన్నారు. 2002 జులైలో ధీరూభాయ్ అంబానీ మృతి తర్వాత అంబానీ సోదరులిద్దరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ముకేష్, అనిల్ 2006లో విడిపోయారు. వ్యాపారాలను కూడా పంచుకున్నారు.

English summary
Industrialists Mukesh and Anil Ambani do not have any differences between them and the two brothers are together now, their mother Kokilaben said today as the family prepared for a reunion at inauguration of a memorial of their father Dhirubhai Ambani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X