దుబాయ్ శేఖర్: కెసిఆర్పై మోత్కుపల్లి, ఎర్రబెల్లి నిప్పులు

కెసిఆర్కు సంబంధించి నిజాలు బయటపెడుతున్నందుకే తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అలాంటి వాటికి తాము భయపడేది లేదన్నారు. సెంటిమెంటును అడ్డం పెట్టుకొని దీక్షల పేరుతో పేదల పిల్లల ప్రాణాలు బలితీసుకున్నారన్నారు. సకల జనుల సమ్మెను అమ్ముకున్నారని విమర్శించారు. ప్రధానితో కెసిఆరే ప్రకటన ఇప్పించారని ఆరోపించారు. కెసిఆర్ అసలు పేరు దుబాయ్ శేఖర్ అని, ఆయన సొంత జిల్లా విజయనగరమని తెలంగాణ కాదన్నారు. దొంగ పాసుపోర్టులు ఇప్పిస్తానని కరీంనగర్లో అనేకమందిని మోసం చేశారన్నారు. తెలంగాణలో పనులు జరగాలన్నా, సినిమాలు విడుదల కావాలన్నా కెసిఆర్కు ముడుపులు ఇవ్వాల్సిందేనని ఆరోపించారు. తెలంగాణ పరువు తీస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా వారు కెసిఆర్కు 30 ప్రశ్నలు సంధించారు.












Click it and Unblock the Notifications