గాలి దోచుకుంది రూ.5194కోట్లు: ఛార్జిషీట్లో సిబిఐ
అనంత జిల్లాలోని ఓబుళాపురం, సిద్ధాపురం, మలపనగుడి ప్రాంతాల్లో మొత్తం ఆరు లీజులు మంజూరు కాగా మూడు లీజులు ఓంసికి దక్కాయని, 2001 అక్టోబరు 29న ఓఎంసి ఏర్పాటైందని, అయితే 2002 మే 2న గాలి, మరో ఐదుగురు డైరెక్టర్లుగా ఓఎంసిని స్వాధీనం చేసుకున్నారని ఛార్జిషీటులో పేర్కొంది. శ్రీనివాస్ రెడ్డి 2003లో డైరెక్టర్గా చేరారని, ఆ తర్వాత 2005లో రాజగోపాల్ బావమరిది రాజశేఖర్ డైరెక్టర్గా చేరారని పేర్కొన్నారు. 2007లో రాజశేఖర్ రాజీనామా చేసినప్పటికీ ఆ తర్వాత కూడా డైరెక్టర్ హోదాలో సంతకాలు చేస్తూ వచ్చారని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఓఎంసి ఇనుప ఖనిజాన్ని తరలించిందని పేర్కొంది.
ఛార్జిషీటులో బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి, విడి రాజగోపాల్, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, ఆఱ్.లింగారెడ్డిలను నిందితులుగా సిబిఐ పేర్కొంది. ఐపిసి 120బి, 420, 409, 468, 471 తదితర అభియోగాలు మోపింది. అలాగే పలు మైనింగ్ కంపెని బాధితులను సాక్షులుగా పేర్కొంది.