హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి వర్గంలోకి 17న చిరంజీవి వర్గ ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులను ఇద్దరిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17వ తేదీన ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఎమ్మల్సీ రామచంద్రయ్యను, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావును కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలోకి తీసుకుంటారు. ఈ ముహూర్తాన్ని కూడా చిరంజీవే ఖరారు చేశారని తెలుస్తోంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సమక్షంలో ఈ ముహూర్తం ఖరారైంది. ఒకవేళ ఏదైనా ఆటంకం ఏర్పడితే తప్ప ఆ ముహూర్తం మారే అవకాశం లేదు. ఒకవేళ మార్చాల్సి వచ్చినా అది ఈ నెల 20వ తేదీ లోపే ఉంటుందని అంటున్నారు. ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వాలని చిరంజీవి పట్టుబట్టినా ఆజాద్ సర్ది చెప్పారు.

రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదనను కడప కాంగ్రెసు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అయితే చిరంజీవి పట్టుబడుతుండడంతో ఆయనకే మంత్రి పదవి ఖరారైంది. కాగా, చిరంజీవి వర్గానికి చెందిన శాసనసభ్యులకు విప్, కార్పొరేషన్ పదవులు దక్కనున్నాయి. మంత్రి పదవుల కోసం ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో ఆలస్యం జరగడంపై తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. మంత్రి పదవులు దక్కించుకునే ఇద్దరికి కూడా ముఖ్యమైన శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

English summary
Two leaders from Prajarajyam will be inducted into CM kiran kumar Reddy's cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X