తెలంగాణలో వైయస్ జగన్ దీక్ష సాగుతుందా?

YS Jagan
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రైతు దీక్ష చేపట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ సెగ తప్పేట్లు లేదు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఆర్మూర్‌లో ఆయన దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని ప్రకటించడం ద్వారా సానుభూతి సంపాదించుకుని, తెలంగాణలో అడుగు పెట్టాలనే ఆయన ప్రయత్నాలకు గండి పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లాలో పర్యటించినట్లుగానే ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారా అనేది కూడా చెప్పలేని స్థితి. అయితే, చంద్రబాబుది ఒక్క రోజు పర్యటన కావడంతో పెద్దగా సమస్యలు తలెత్తలేదు. కానీ జగన్ మూడు రోజులు దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇది కష్టమే కావచ్చు. మరో వైపు జగన్ దీక్షకు పోలీసులు అనుమతి ఇస్తారా అనేది కూడా అనుమానంగానే ఉంది.

వైయస్ జగన్ నిజామాబాద్ పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ విద్యార్థి జెఎసి నాయకుడు పిడమర్తి రవి ప్రకటించారు. తెలంగాణను వంచిస్తున్నారని, రాయలసీమ గూండాలతో జగన్ నిజామాబాద్ జిల్లాకు రావాలనుకుంటున్నారని తెలంగాణ విద్యార్థి జెఎసి నాయకులు విమర్శిస్తున్నారు. జగన్‌ను అడుగడుగునా అడ్డుకుంటామని వారంటున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా మహబూబా బాద్‌లో తలపెట్టిన ఓదార్పు యాత్ర భగ్నమైన అనుభవం జగన్‌కు ఉంది. అదే పంతంతో ఆయన నిజామాబాద్ జిల్లాకు చేరుకునే ప్రయత్నం చేస్తారా అనేది కూడా చెప్పలేం. మొత్తం మీద, వైయస్ జగన్ నిజామాబాద్ జిల్లా పర్యటన అంత సులభంగా జరిగే పరిస్థితి లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+