వైయస్ జగన్‌కు మాజీ తెరాస నేత గంగారెడ్డి మద్దతు

YS Jagan
నిజామాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మాజీ నాయకుడు కేశుపల్లి గంగారెడ్డి మద్దతు ప్రకటించారు. మాజీ మంత్రి, తెరాస మాజీ నేత సంతోష్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు గంగారెడ్డి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ చేపట్టే ఆర్మూర్ దీక్షకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయన మద్దతు ప్రకటించారు. తాను దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానిని అని ఆయన చెప్పుకున్నారు. తాను ఎప్పుడు కలిసినా వైయస్సార్ ఆప్యాయంగా పలకరించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.

అందరం ఒకే కుటుంబానికి చెందినవారమని వైయస్ చెప్పేవారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కాబట్టి జగన్‌ను కూడా తాను అభిమానిస్తానని ఆయన చెప్పారు. రైతుల కోసం జగన్ చేపట్టిన దీక్షకు తన మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. వైయస్ జగన్ మంగళవారం ఉదయం ఆర్మూర్‌లో రైతు దీక్ష చేపట్టేందుకు బయలుదేరారు. మధ్యలో కొలను శ్రీనివాస రెడ్డి జగన్‌ను కలిసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. జగన్ మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్ యాత్రను అడ్డుకోవడానికి తెలంగాణవాదులు ప్రయత్నించారు. రోడ్డుపై అక్కడక్కడ టైర్లు కాల్చి అడ్డంగా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+