ప్రాణహితకోసం పాదయాత్ర రాజకీయం లేదు: దేవేందర్
సాధారణం కంటే రెట్టింపుతో టెండర్లు కట్టబెట్టి రూ.1100 కోట్లు తిన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా ప్రాజెక్టును చేపట్టాలన్నారు. 25లోగా కేంద్రం స్పందించకుంటే తమ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. పోలవరం కోసం పట్టుపడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు రావద్దనే అంతిమంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుస్తామన్నారు. ఉప ఎన్నికలకు పాదయాత్రకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పార్టీలకతీతంగా తమకు సంఘీభావం తెలిపితే అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెసు అభివృద్ధిపై కూడా మోసం చేస్తోందన్నారు. అమరవీరుల కుటుంబాలను టిడిపి తప్పకుండా ఆదుకుంటుందన్నారు.
Comments
devendar goud errabelli dayakar rao telangana hyderabad దేవేందర్ గౌడ్ ఎర్రబెల్లి దయాకర రావు ప్రాణహిత చేవెళ్ల తెలంగాణ హైదరాబాద్
English summary
TTDP planned to padayatra from Chevella to Pranahitha for national status, said TDP leaders Devendar Goud and Errabelli Dayakar Rao.
Story first published: Thursday, January 12, 2012, 16:48 [IST]