వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chittoor District
చిత్తూరు: చిత్తూరు జిల్లా పూతలపట్టు గ్రామం వద్ద శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలు కాగా, 30 మంది దాకా గాయపడ్డారు. గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడిన వారిని చిత్తూరు ఆస్సత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. తమిళనాడులోని వేలూరు సిఎంసికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు మరణించారు. బెంగుళూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సులోని ముగ్గురు, లారీ డ్రైవర్, కారులోని ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.

బస్సును కారు ఓవర్ టేక్ చేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. బస్సు అదుపు తప్పి కారును ఢీకొట్టింది. ఈ రెండు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాయి. బస్సులో మరణించినవారు కర్ణాటకవారని తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్నవారు తమిళనాడుకు చెందినవారు. కారు తమిళనాడు నుంచి తిరుపతి వస్తోంది. లారి తిరుపతి నుంచి తమిళనాడు వెళ్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

English summary
In a road accident near Puthalapattu of Chittoor district seven killed and 30 injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X