హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాన్నగారి అడుగు జాడల్లో నడుస్తా: బాలయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: నాన్న ఎన్టీ రామారావు అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవకు అంకితమవుతానని తెలుగు సినీ హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజాశీర్వాదం ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానని ఆయన చెప్పారు. నాన్నగారి ఆశయసాధనకు కృషి చేస్తానని బాలకృష్ణ స్పష్టం చేశారు. తన తల్లి జ్ఞాపకార్థం ప్రారంభించిన బసవతారకం మెమోరియల్ కేన్సర్ ఆస్పత్రి అభివృద్ధికి నిధుల సేకరణకోసం ఆయన మస్కట్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఓ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. తాను ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నానని, అందులో భాగంగానే మస్కట్ వచ్చానని ఆయన చెప్పారు.

మస్కట్‌లో తనకు లభించిన ఘన స్వాగతాన్ని ఎన్నడూ మరచిపోనన్నారు. కేన్సర్ రోగుల కోసం నిర్మించిన బసవతారకం స్మారక ఆస్పత్రిని ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆస్పత్రిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణ మూడు రోజులపాటు మస్కట్‌లో పర్యటించనున్నారు. మూడు నెలల్లోపు మరోసారి బాలకృష్ణ గల్ఫ్‌లోని ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తారు. కాగా బాలకృష్ణ సోమవారం మస్కట్‌లోని సుల్తాన్ ఖబూస్ మసీద్, ప్రసిద్ధ రాయల్ ఆస్పత్రిని సందర్శించారు.

English summary
Hero Balakrishna said that he follow his father NT Rama Rao's foot steps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X