హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కార్తీక్ తనే శిక్షించుకుంటున్నాడు:శంకర్రావుపై సబిత ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర రావు విమర్శలపై హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి బుధవారం స్పందించారు. తన ఫాంహౌస్‌లోనే కొందరి హత్యకు కుట్ర జరిగిందన్న వ్యాఖ్యలపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె ఇప్పటి వరకు శంకర రావు ఆరోణలపై స్పందించిన దాఖలాలు లేవు. కానీ ఫాంహౌస్‌లో హత్య జరిగిందనడంతో ఆమె స్పందించారు. తన కుటుంబానికి అసలు ఫాంహౌసే లేనప్పుడు ఇక కుట్రలు ఎక్కడ చేసినట్లు అని ప్రశ్నించారు. కుళ్లు రాజకీయాలు మాని ధైర్యం ఉంటే నేరుగా ఎదుర్కొవాలని సవాల్ విసిరారు. అవసరమైనప్పుడు గట్టి కౌంటర్ ఇస్తానని హెచ్చరించారు. ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నా తమ కుటుంబంపై ఎలాంటి మచ్చ లేదన్నారు.

మంత్రి శంకర రావు ఉద్దేశ్య పూర్వకంగా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏ పాపం ఎరుగని తన కుమారుడు కార్తీక్ రెడ్డిపై ఆయన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. దీంతో మనస్తాపం చెందిన కార్తీక్, సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని, ఇంట్లోనే ఉంటూ తనను తానే శిక్షించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమయం వచ్చినప్పుడు గట్టిగా ప్రతిస్పందిస్తానని హెచ్చరించారు. కాగా శంకర రావు సబితా రెడ్డి, ఆమె తనయుడుపై ఇటీవల తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

English summary
Home minister Sabitha Indra Reddy fired at minister Shankar Rao for allegations on her and her son Karthik Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X