విధులకు ఆటంకం కేసు: సి.రామచంద్రయ్యకు ఊరట

ఇదే కేసులో బుధవారం రాజంపేట కోర్టుకు రామచంద్రయ్య హాజరు కావాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం కేసును ఉపసంహరించుకుంది. ఉపసంహరణకు సంబంధించిన పత్రాలు కోర్టుకు అందకపోవడం, రామచంద్రయ్య కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి సాయంత్రం వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ప్లీడరు ద్వారా కోర్టుకు ఆ పత్రాలను అందజేసింది. ఐతే అప్పటికే సమయం మించిపోవడంతో తుదితీర్పును 30కి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications