నిమ్స్లో కోనేరు ప్రసాద్కు చికిత్స: కోర్టు అనుమతి
ఇదిలా ఉంటే, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో తుమ్మల రంగారావు ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణను కోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్న సునీల్ రెడ్డిని ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులోనూ సిబిఐ విచారించినట్లు సమాచారం. సునీల్ రెడ్డి ఇంట్లో, కార్యాలయంలో సిబిఐ సోదాలు మంగళవారం ముగిశాయి. సునీల్ రెడ్డికి చెందిన ల్యాప్టాప్ను, కీలక పత్రాలను సిబిఐ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఎమ్మార్ కేసుతో తనకు ఏ విధమైన సంబంధం లేదని స్టైలిష్ హోమ్స్ అధినేత రంగారావు చెప్పారు. తనను అరెస్టు చేసేందుకు సిబిఐ ప్రయత్నం చేస్తోందని చెబుతూ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. తాను సిబిఐ విచారణకు సహకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 9వ తేదీన తన వాంగ్మూలాన్ని సిబిఐ రికార్డు చేసిందని ఆయన చెప్పారు.