జూనియర్ డాక్టర్లతో డిఎల్ రవీంద్రా రెడ్డి చర్చలు విఫలం

జూనియర్ డాక్టర్లతో బుధవారం ఉదయం ప్రభుత్వం జరిపిన మొదటి దశ చర్చలు విఫలమయ్యాయి. దీంతో సాయంత్రం మరోసారి సమావేశమయ్యారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత 18 రోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆమరణ దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు జూడాలు ఆమరణ దీక్షకు దిగారు. అత్యవసర సేవలు కొనసాగిస్తామన్న వారు తమ సమస్యలను పరిష్కరించేంత వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. చర్చల పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తోందని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు.
తాము సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు చెబుతుండగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కుంటామని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చెబుతున్నారు. తాము 25 నుంచి 30 శాతం వరకు స్టయిఫెండ్ పెంచుతామని చెబుతున్నామని, దానికి జూనియర్ డాక్టర్లు అంగీకరించడం లేదని, ప్రభుత్వం అంతకన్నా ఏమీ చేయలేదని ఆయన అన్నారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications