వేరే దేశాల్లో అయితే కాల్చేసేవారే: జగన్పై రేవంత్

నేరాలన్నీ ఒప్పుకొని నాటి సత్యం కంప్యూటర్స్ అధిపతి రామలింగరాజు లొంగిపోయినట్లుగానే తన తప్పుల చిట్టా రాసి ఒక ప్రతిని ప్రజలకు, మరో ప్రతిని పోలీసులకు అందించి, అటుపై సీబీఐకి లొంగిపోతే మంచిదని ఆయన జగన్కు సూచించారు. చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డాడంటూ వరంగల్ జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారని ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా.. "ముసుగులో గుద్దులాటలు అవసరం లేదు. చంద్రబాబుపై జగన్ నేరుగా పోరాడవచ్చు. అంతే తప్ప వరంగల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎల్లారెడ్డి అనే వ్యక్తి ముసుగులో కేసు దాఖలు చేయడమెందుకు ? అయినా.. చంద్రబాబు ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని ఇదే తరహా పిటిషన్లపై హైకోర్టు, సుప్రీం కోర్టులే అభిప్రాయపడ్డాయి కదా?'' ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications