జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ముందుకు అజయ్ మిశ్రా

CBI Logo
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ ఎదుట సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా గురువారం ఉదయం హాజరయ్యారు. అజయ్ మిశ్రాను సిబిఐ అధికారులు రెండు గంటల పాటు విచారించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు, మౌలిక వసతుల ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అజయ్ మిశ్రా ప్రస్తుతం సెక్రటేరియెట్‌లోని సాధారణ పరిపాలనా శాఖ (జీఐడీ) లో పొలిటికల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అలాగే జగతి పబ్లికేషన్స్‌కు ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

అలాగే, గనుల అక్రమ తవ్వకం కేసులకు సంబంధించి గనుల వ్యాపారి శశికుమార్ గురువారం ఉదయం సిబిఐ కార్యాలయానికి వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ సిఎస్ రమాకాంత్ రెడ్డి కూడా సిబిఐ ఎదుట హాజరయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. చీఫ్ సెక్రటరీగా ఆయన పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. అలాగే, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు బావమరిది పార్థసారథిని కూడా సిబిఐ విచారించే అవకాశాలున్నాయి. పార్థసారథి ఎపిఐఐసి డైరెక్టరుగా పనిచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+