అంతా మూడు రోజుల్లో ముగుస్తుంది: కెబినెట్పై సిఎం

కాగా తెలంగాణ ప్రాంతం నేతలతో పాటు సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు కూడా విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లిందనే చెప్పవచ్చు. సీమాంధ్ర నుండి కూడా ఒకరిద్దరికి అవకాశమిచ్చిందని కొందరు చెబుతున్నప్పటికీ, సోనియాతో భేటీ అనంతరం సీమాంధ్రకు చెందిన ఆశావహులు కొందరితో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్నా ప్రస్తుతానికి మీకు అవకాశం లేదు అని చెప్పినట్లుగా తెలుస్తోంది. సిఎం వ్యాఖ్యలను బట్టి విస్తరణ కేవలం తెలంగాణకే పరిమితమవుతుందని అర్థమవుతోంది. శనివారం రాత్రి కేవలం ఐదు నిమిషాలే సిఎంతో భేటీ అయిన సోనియా ఆదివారం సాయంత్రం మాత్రం దాదాపు గంట సేపు చర్చించారు. సోనియాను కలిసిన అనంతరం సిఎం ఉల్లాసంగా కనిపించారు. దీంతో విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అప్పుడే చాలామందికి అర్థమై పోయింది.












Click it and Unblock the Notifications