కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యక్తి స్వార్థం వల్లనే నాశనం: వైయస్ జగన్‌పై డిఎల్

By Pratap
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
కడప: వ్యక్తి స్వార్థం వల్లనే గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థ నాశనమైందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిందో ఐఎఎస్ అధికారులే నిర్భయంగా చెప్పాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పెద్ద చేపలెవరో ఐఎఎస్ అధికారులు చెప్పాలని ఆయన అన్నారు. తప్పులు చేయనప్పుడు ఐఎఎస్ అధికారులు బాధపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తప్పులు చేసినవారు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని మరో మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు.

జూనియర్ డాక్టర్లు మొండిగా వ్యవహరిస్తున్నారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. సమ్మె విమరిస్తే చర్చలు జరిపి జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. జూనియర్ డాక్టర్లు విద్యార్థులేనని, ఉద్యోగులు కారని ఆయన అన్నారు.

English summary
DL Ravindra Reddy making a comment agianst YSR Congress president YS Jagan said that due to one person system was collapsed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X