Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పంతం నెగ్గించుకున్న ముఖ్యమంత్రి: విస్తరణకు ఒకె

Kiran kumar Reddy
న్యూఢిల్లీ: మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానం వద్ద పంతం నెగ్గించుకున్నారు. రెండు రోజులు ఢిల్లీలో మకాం వేసి మంత్రి వర్గ విస్తరణకు ఆమోదం పొందారు. దీంతోమరోసారి రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. తెలంగాణ వారికి స్థానం కల్పించేందుకు వీలుగా పరిమిత విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పడంతో మంత్రివర్గ విస్తరణ ఏర్పాట్లలో కిరణ్ కుమార్ రెడ్డి నిమగ్నమయ్యారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో లేరు. ఆయన సోమవారం సాయంత్రానికి రాష్ట్ర రాజధాని చేరుకుంటారు. ఈ నేపథ్యంలో అన్నీ కుదిరితే సోమవారం సాయంత్రమే విస్తరణ జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలా కుదరకపోతే ఈ నెల 9న (గురువారం) విస్తరణ ఉంటుందని ఈ వర్గాలు వెల్లడించాయి.

కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చలు ముగించుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వెళుతూ విమానాశ్రయంలో - "రాబోయే రెండు మూడు రోజుల్లో (విస్తరణ) అంతా అయిపోతుంది'' అని ముఖ్యమంత్రి చెప్పడాన్ని బట్టి మంత్రి వర్గ విస్తరణకు అవకాశం లభించిందని అనుకోవచ్చు. మంత్రివర్గంలో భారీ మార్పులు ప్రస్తుతానికి లేదు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రస్తుతానికి తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చేందుకు, కొన్ని శాఖలను పునర్వ్యవస్థీకరించేందుకు సీఎం కిరణ్‌కు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు, ఉప ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కేబినెట్ పునర్వ్యవ స్థీకరణపై తాము పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని హైకమాండ్ చెప్పినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో శనివారం రెండు గంటల పాటు చర్చలు జరిపిన సీఎం ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ చర్చించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారమంతా ఏపీ భవన్‌లో కసరత్తు జరుపుతూ - ఆజాద్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ గడిపారు. సోనియా గాంధీ, ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌తో కిరణ్ ఆదివారం సాయంత్రం దాదాపు గంట సేపు మంతనాలు జరిపారు. మంత్రివర్గ విస్తరణతో పాటు ఉప ఎన్నికల్లో వ్యూహరచన, రాష్ట్ర రాజకీయ పరిస్థితి, మీడియాలో జరుగుతున్న ప్రచారం, రాజీవ్ యువకిరణాలు మొదలైన అనేక అంశాలపై అధిష్ఠానానికి ఈ భేటీలో కిరణ్ వివరించారు. ప్రధానంగా మద్యం సిండికేట్, ఏసీబీ దాడుల గురించి సీఎం చెప్పినట్లు తెలిసింది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కిరణ్‌కు అధిష్ఠానం సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+