Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విస్తరణలో మంత్రి పదవులు దక్కే ముగ్గురు ఎవరు?

Gandra Venkata ramana Reddy-Uttam kumar Reddy
న్యూఢిల్లీ: మంత్రి పదవులు దక్కే ఆ ముగ్గురు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు తెలంగాణవారికి మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెసు అధిష్టానం అంగీకరించడంతో మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్న విధంగా ఆయన సన్నిహితుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం లభించవచ్చునని చెబుతున్నారు. అదే సమయంలో వరంగల్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాదరావులలో ఒకరికి స్థానం ఖాయమని చెబుతున్నారు.

కాగా, సీనియర్ శాసనసభ్యుడు పి.కిష్టారెడ్డి (నారాయణఖేడ్)కి స్థానం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. సీమాంధ్రలో కూడా ఒకరిద్దరు చేరే అవకాశాలు లేకపోలేదని, ముఖ్యమంత్రికి ఈ విషయంలో హైకమాండ్ స్వేచ్ఛనిచ్చిందని కూడా ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అయితే.. సోనియాను కలిసిన తరువాత ఆశావహులు కొందరితో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మీకు అవకాశం లేదని ఆయన సీమాంధ్ర నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుత విస్తరణలో సీమాంధ్ర వారికి స్థానం ఉండకపోవచ్చునని తెలుస్తోంది.

కిరణ్‌కుమార్ రెడ్డికి శనివారం ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం మాత్రం గంట సమయం కేటాయించారు. సోనియా గాంధీ, గులాంనబీ ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌తోనూ కిరణ్ దాదాపు గంట సేపు మంతనాలు జరిపారు. సోనియాను కలిసిన తర్వాత ముఖ్యమంత్రి ఉల్లాసంగా కనిపించారు. కొద్ది సేపు టెన్ జనపథ్ బయట ఆజాద్, అహ్మద్‌పటేల్‌లతో మంతనాలు జరిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+