ఒకటి, రెండు రోజుల్లో జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు

Nadendla Manohar
హైదరాబాద్: విప్‌ను ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై ఒకటి, రెండు రోజుల్లో వేటు పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ వర్గానికి చెందిన 16 మంది కాంగ్రెసు శాసనసభ్యులపై శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హత వేటు వేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. స్పీకర్ ముందు హాజరు కావడానికి కూడా వారు నిరాకరించారు. స్పీకర్ సాక్షిగానే తాము విప్‌ను ధిక్కరించినందున తాము మళ్లీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, స్పీకర్ తమపై వేటు వేయాలని వారన్నారు. దీంతో వారి హాజరీని పట్టించుకోకుండా వేటు వేయడానికి ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈలోగానే వారిపై అనర్హత వేటు పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కాగా, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డిపై అనర్హత వేటు వేస్తే న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురవుతాయా అనే మీమాంసలో స్పీకర్ పడినట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో తనకు విప్ జారీ చేసే హక్కు లేదని శోభా నాగిరెడ్డి వాదిస్తున్నారు. అయితే, అదే సమయంలో ఆమె తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమెపై అనర్హత వేటు వేయడం కన్నా ఆమె రాజీనామాను ఆమోదించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఏమైనా, జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు భవిష్యత్తు శాసనసభా సమావేశాల లోగా తేలిపోయే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+