'తెలంగాణ' ఉద్యమ కేసులు ఎత్తివేయండి!: సిఎం ఆర్డర్

Kiran Kumar Reddy
హైదరాబాద్: ప్రాంతీయ ఉద్యమాల కేసులు ఎత్తి వేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు మంగళవారం సూచించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాంతీయ ఉద్యమాల కేసులు సాధ్యమైనన్ని ఎత్తివేయాలని వారిని ఆదేశించారని సమాచారం. ఈ కేసుల ఎత్తివేత కూడా బడ్జెట్ సమావేశాలలోగా పూర్తి చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఎత్తివేత సమయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని సూచించారని తెలుస్తోంది. ఉద్యోగార్థులైన విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే తేల్చాలని, వారిని వేధించవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల భద్రతా చర్యల పైనా ఆయన సమీక్షలో చర్చించారు.

కాగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని తెలంగాణవాదులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై గతంలోనే స్పందించిన ప్రభుత్వం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేసేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే న్యాయపరమైన చిక్కులు ఉన్న వాటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఇటీవల హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా విద్యార్థులపై కేసులు ఎత్తివేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. న్యాయపరమైన చిక్కులు ఉన్న వాటిపై సమయం పడుతుందన్నారు. సాధ్యమైనన్ని కేసులు ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సుమారు 1400 కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటిలో ఇప్పటికే ఆరువందలకు పైగా కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆస్తుల ధ్వంసం, దోపిడీ తదితర కేసుల్లో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశముంది. ఇలాంటి కేసులు ఎత్తివేసిన పక్షంలో బాధితులకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారనే ప్రశ్న తలెత్తడంతో పాటు, భవిష్యత్తులో వీటిని చూపి కేసులు ఎత్తి వేయమని డిమాండ్‌లు చేసే అవకాశముంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+