ప్రభుత్వం చిల్లరకొట్టు కాదు: జూడాల డిమాండ్‌పై బొత్స

 Botsa Satyanarayana
హైదరాబాద్: ప్రభుత్వం చిల్లరకొట్టు కాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలిలో ఆయన మంగళవారం జూనియర్ డాక్టర్ల సమ్మెపై ప్రతిస్పందించారు. జూనియర్ డాక్ట్రర్ల స్టయిఫండ్‌ను పెంచమంటే పెంచడానికి, తగ్గించమంటే తగ్గించడానికి కుదరదని ఆయన అన్నారు. స్టయిఫండ్ పెంపు శాస్త్రబద్దంగా ఉండాలని ఆయన అన్నారు. నెలకు 50 వేల రూపాయలకు స్టయిఫండ్ పెంచాలంటే ఎలా అని, దానికి ప్రాతిపదిక ఏదని ఆయన అడిగారు.

జూనియర్ డాక్టర్ల స్టయిఫండ్ అంశాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలతో మన రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లకు చెల్లిస్తున్న స్టయిఫండ్‌ను పోల్చి చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. జూనియర్ డాక్టర్లకు ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నామని ఆయన అన్నారు. జూనియర్ డాక్టర్లు వెంటనే సమ్మె విరమిచాలని ఆయన సూచించారు. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించాలని సూచిస్తూ శాసనమండలిలో తీర్మానం చేయాలని ఆయన అన్నారు. స్టయిఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్ల సమ్మె మంగళవారం కూడా కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+