వైయస్కు ఆనాడే చెప్పా, ఏ తప్పు చేయలేదు: బాబు
తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చాయని, చాలా స్పష్టంగా చెప్పామని, తెలంగాణ సమస్యను పరిష్కరించే బాధ్యత కాంగ్రెసుపై ఉందని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెసు అధికారంలో ఉంది ఆ సమస్యను కూడా ఆ పార్టీయే పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. బిజెపితో కుమ్మక్కయి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అక్రమ మైనింగ్ లీజులు అప్పగించారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు టెండర్ను నమస్తే తెలంగాణ పత్రికలో భాగస్వామి కాబట్టి ఇచ్చారని ఆయన అన్నారు. వాస్తవాలు బయట పెట్టాసలని తాము డిమాండ్ చేశారని, భయపడి టెండర్ రద్దు చేశారని, రద్దు చేసినంత మాత్రాన తప్పును కప్పిపుచ్చుకోలేరని ఆయన అన్నారు. పోలవరం టెండర్ల ఖరారులో అక్రమాలు జరిగాయని, ఫైలును స్పీకర్ ముందు పెట్టాలని ఆయన అన్నారు. అవినీతి విషయంలో రాజకీయాలు, పార్టీలు లేవని, ఇష్టానుసారంగా కలిసిపోతున్నారని ఆయన అన్నారు. తెరాస తెలుగుదేశంపై విరుచుకుపడుతోందని, వైయస్సార్ కాంగ్రెసుపై, కాంగ్రెసుపై విమర్శలు చేయడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయాలనుకునేవారే దెబ్బ తింటారని ఆయన అన్నారు.
మహిళలను లక్షాధికారులను చేస్తామని చెప్పి కాంగ్రెసు ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్త్రీలు ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ క్రెడిట్ తమ పార్టీ ఘనతేనని ఆయన చెప్పుకున్నారు. వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో కేటాయింపులు తక్కువ జరిపారని ఆయన అన్నారు. తమ 9 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా గ్యాస్ ధర పెంచలేదని ఆయన గుర్తు చేశారు. మద్యాన్ని నియంత్రించాలని, బెల్టు షాపులు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.