మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు, గవర్నర్కూ..
కాగా సభలో ఇళ్ల కేటాయింపులో అక్రమాలకు జైలుకు వెళతావని చంద్రబాబు మంత్రి పార్థసారథిని ఉద్దేశించి అన్నారు. అందుకు మంత్రి తాను తప్పు చేస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని, స్టే మాత్రం తెచ్చుకోనని అన్నారు. కృష్ణా జిల్లాలో ఇళ్ల కేటాయింపుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెసు సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దాంతో తెలుగుదేశం సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలుగుదేశం సభ్యుల ఆరోపణలకు మంత్రి పార్థసారథి ప్రతిస్పందిస్తూ వివరణ ఇచ్చారు. తాను జీవోను ఉల్లంఘిస్తే జైలుకు వెళ్తాను గానీ స్టే తెచ్చుకోనన్నారు. తనను అడిగినవారికి ఇళ్లు కేటాయించానని, తెలుగుదేశం పార్టీవారికి కూడా ఇచ్చానని, రచ్చబండలో దరఖాస్తు చేస్తున్నవారికి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి ఇళ్లు ఇచ్చానని ఆయన అన్నారు. అనర్హులకు ఇళ్లు ఇస్తే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పచ్చచొక్కాలవాళ్లు ఏ విధంగా చేశారో తమకు తెలుసునని ఆయన అన్నారు.