ఎంపీలు రేపిస్టులు, హంతకులు: అర్వింద్ కేజ్రీవాల్

కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి లూలా ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ మండిపడింది. కెజ్రీవాల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పార్లమెంట్కే అవమానమని అన్ని పార్టీలు విరుచుకుపడ్డాయి. ఆయనకు పార్లమెంట్పైనా, రాజ్యాంగం పట్ల ఎలాంటి విశ్వాసం లేదని చెప్పడానికి పరుష వ్యాఖ్యలే నిదర్శనమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్పై పార్లమెంట్లో హక్కుల తీర్మానం తీసుకొస్తామని ఆర్జేడీ ప్రకటించింది.
అధికార కాంగ్రెస్ పార్టీ కూడా కేజ్రీవాల్పై మండిపడింది. ఇలాంటి మాటలు పార్లమెంట్కు, చట్టసభ సభ్యుల్ని ఎన్నుకునే ప్రజలకూ అవమానమని కాంగ్రెస్ ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కెజ్రీవాల్ మాట్లాడారని, ఇది ఆయన దురహంకారానికి నిదర్శనమని భారతీయ జనతా పార్టీ విమర్శించింది.












Click it and Unblock the Notifications