ఎపిలో పట్టించుకోవడం లేదు: ప్రధానికి విహెచ్ ఫిర్యాదు

అయితే ఆంధ్రప్రదేశ్లో సెజ్లు పొందిన కంపెనీలు ఇవేమీ పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. 109 సెజ్లు అనుమతి పొందగా, వాటిలో 36 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్లో అనుమతి పొందిన సెజ్లు 35 మాత్రమేనని గుర్తు చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వ అండదండలతో కొన్ని ప్రైవేటు కంపెనీలు పెద్ద ఎత్తున భూములు పొందాయని తెలిపారు. ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా ఐటీ పార్క్, రాంకీ ఫార్మాసిటీ, బ్రాండిక్స్, మైటాస్, అన్రాక్ తదితర సెజ్లన్నీ ఇలాగే భూములు పొందాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సెజ్లపై సమీక్ష జరపాలని కోరారు.












Click it and Unblock the Notifications