మోపిదేవిపై హింసించి ఎసిబి చెప్పించింది: నున్నా రమణ

తనకు మద్యం సిండికేట్లతో సంబంధం లేదని, తాను వ్యవసాయం చేసుకుంటున్నానని, తన పిల్లల చదువుల కోసం, తన భార్య ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల మాత్రమే తాను ఖమ్మంలో ఉంటున్నానని అతను చెప్పాడు. ఎసిబి అధికారులు పెట్టిన బాధలు తాను భరించలేకపోయానని, ఎసిబి అధికారులు తనను అనవసరంగా ఇరికించారని అతను చెప్పాడు. తనపై ఒత్తిడి తెచ్చి ఎసిబి అధికారులు ఇంతకు తన వాంగ్మూలాన్ని వారిష్టం వచ్చినట్లు రాసుకున్నారని ఆరోపించాడు.
తనకు ఏ సంబంధం లేని విషయాలు అధికారులు చేర్చారని అతను చెప్పాడు. ఎసిబి అధికారులు తనతో తప్పుడు ప్రకటనలు చేయించారని అన్నాడు. ప్రస్తుతం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో రమణ అధికారులకు, ఇతరులకు ముడుపులు ఇచ్చిన విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. ఓ సీనియర్ న్యాయవాది రమణ తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రమణ బెయిల్ పిటిషన్పై ఎసిబి అధికారులు కౌంటర్ దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications