వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లగొండ జిల్లాలో మద్యం వ్యాపారి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Nalgonda District
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఓ మద్యం వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలోని గోపాయపల్లి గ్రామం వద్ద రైలు పట్టాలపై అతని శవం కనిపించింది. ఫలక్‌నుమా రైలు కింద పడి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు దృష్టి సారించిన నేపథ్యంలో రాజగోపాల్ అనే ఆ మద్యం వ్యాపారి ఆత్మహత్య చర్చనీయాంశంగా మారింది.

సంధ్యా వైన్స్ యజమాని అయిన రాజగోపాల్ 15 ఏళ్లుగా మద్యం వ్యాపారం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అంటున్నారు. అయితే, మద్యం సిండికేట్ల వ్యవహారంలో అతను హత్యకు గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజగోపాల్ డైరీలో పలువురి పేర్లు ఉన్నాయని, దానివల్ల తమ పేర్లు బయటపడతాయని అతన్ని హత్య చేసి ఉంటారని వారంటున్నారు. కొద్ది రోజుల క్రితం అతను కనిపించకుండా పోయి ఆ తర్వాత శవమై తేలాడు.

English summary
A wine shop owner has committed suicide in Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X