దాసరి నారాయణ రావుపై వేటు, చిరంజీవికి చోటు?
మిగిలింది దాసరి నారాయణ రావు స్థానం ఒక్కటే. అయితే రాష్ట్రం నుండి చిరంజీవితో పాటు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి, వెంకట్రామి రెడ్డి, జివికె రెడ్డి తదితరులు క్యూలో ఉన్నారు. కడపతో పాటు సీమలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే వైయస్ వివేకానందకు ఇవ్వడమే సముచితమని పలువురు భావిస్తున్నారు. అయితే హామీ మేరకు చిరంజీవిని కూడా రాజ్యసభకు పంపించవలసి ఉంటుందని అంటున్నారు. వీరికి న్యాయం చేయాలంటే ఇప్పటికే రెండుసార్లు రాజ్యసభకు వెళ్లిన దాసరి నారాయణ రావును తప్పించక తప్పదని అంటున్నారు. సాధారణంగా కాంగ్రెసులో రెండుసార్లు రాజ్యసభకు పంపిస్తారు. దాసరి ఈ సారితో రెండు పర్యాయాలు పూర్తి చేసుకుంటున్నారు. మరోవైపు చిరంజీవి కూడా దాసరి సామాజిక వర్గానికి చెందిన నేత మాత్రమే కావడం కాకుండా అదే జిల్లాకు చెందిన వ్యక్తి. దీంతో దాసరిని తప్పించి చిరంజీవికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని అంటున్నారు.