ఆధారాల్లేకుండా జగన్‌పై చెయ్యి వేస్తే..: అంబటి హెచ్చరిక

Ambati Rambabu
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ చేయి వేస్తే లక్షలాది రాష్ట్ర ప్రజల చేతులు సమాధానం చెబుతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం హెచ్చరించారు. కాంగ్రెసు, టిడిపి చెప్పినట్లు విని జగన్‌ను అరెస్టు చేస్తే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. జగన్ ఇంటి వద్ద చాలా మంది చేరారని, అరెస్టుకు సిబిఐ సిద్దమవుతోందని కొన్ని పత్రికలు, టివి ఛానళ్లు చెబుతున్నది అంతా అవాస్తవమన్నారు. కాంగ్రెసు, టిడిపి, ఆ పత్రికలు పని కట్టుకొని ప్రచారం చేస్తున్నాయన్నారు. వాటిని ఎవరూ నమ్మవద్దన్నారు. జగన్ తన పిల్లలతో గడిపేందుకే కొవ్వూరు నియోజకవర్గంలో ప్రచారాన్ని సోమవారానికి వాయిదా వేసుకున్నారన్నారు. జగన్ ను అరెస్టు చేస్తారని కొందరు అంటున్నారని అసలు జగన్ ను ఎందుకు అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇంత వరకు సిబిఐకి జగన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని, అందుకే అరెస్టు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తోందని అన్నారు.

జగన్ ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే ఆధారాలు లభించలేదన్నారు. కాంగ్రెసు, టిడిపి చెప్పినట్టు విని సిబిఐ జగన్ ను అరెస్టు చేస్తే మాత్రం లక్షలాది ప్రజల చేతులు లేస్తాయని హెచ్చరించారు. కాంగ్రెసు చెప్పినట్టు సిబిఐ వింటే జరిగే పరిణామాలకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆధారాలు లేకుండా జగన్ పై చెయ్యి వేస్తే వొళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు. ఇది జగన్ పై పడుతున్న చెయ్యిగా ఎవరూ భావించరని, తెలుగు గడ్డపై, ప్రజలపై పడుతున్న చెయ్యిగా భావిస్తారన్నారు. జగన్ అరెస్టు ప్రచారం కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం రాజకీయ కక్ష కోసమే ఈ ప్రచారం అన్నారు. ప్రజలే తన బిడ్డగా జగన్ ను ఆదరిస్తున్నారన్నారు. కాంగ్రెసు, టిడిపిలకు ధైర్యం ఉంటే ఎన్నికల్లో సత్తా చూపాలని సవాల్ విసిరారు. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో ఉప ఎన్నికల్లో తేలుతుందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని క్రిమినల్ గా చూపించారని దానికి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఏం బాధ్యత వహించారని ప్రశ్నించారు. జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కాంగ్రెసును ఆ దేవుడు కూడా రక్షించలేడన్నారు. వైయస్ కుటుంబంపై కక్ష సాధింపును ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు గతంలో కంటే మెజార్టీ అధికంగా వస్తుందన్నారు. జగన్ ఇంటికి అభిమానంతోనే కార్యకర్తలు వచ్చారన్నారు. సోమవారం నుండి జగన్ కొవ్వూరు ప్రచారం యథావిథంగా జరుగుతుందన్నారు. నేతలను కలిసేందుకు జగన్ కొంత సమయం కేటాయించారని అన్నారు. అన్ని పత్రికలు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వవద్దన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+