గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమాంధ్ర ఆకాంక్ష మేరకే రాయపాటి ఉద్యమం: పొన్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
గుంటూరు: సకల జనుల సమ్మె సమయంలో తెలంగాణ సాధన కోసం ఉధృతంగా ఉద్యమించిన పొన్నం ప్రభాకర్ ఆదివారం గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావును ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే తాము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమిస్తున్నామని చెప్పారు. మాలాగే రాయపాటి కూడా ఆంధ్రా ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమిస్తున్నారని చెప్పారు. ఉద్యమాల్లో అనేకం జరుగుతుంటాయని ఆయన వ్యాఖ్యానించారు. మాదంతా ఒకే కుటుంబమని, కాంగ్రెసు కుటుంబమని పొన్నం చెప్పారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని రాయపాటి చెప్పారు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అన్నారు.

కాగా పొన్నం ప్రభాకర్ సకల జనుల సమ్మె సమయంలో తెలంగాణ కోసం ఉద్యమించిన విషయం తెలిసిందే. జెఏసి రూపొందించిన పలు కార్యక్రమాల్లో ఆయన ఇతర తెలంగాణ ఎంపీలతో కలిసి పాల్గొన్నారు. పలుమార్లు తెలంగాణ కోసం ఆవేశంగా మాట్లాడారు. మరోవైపు రాయపాటి సాంబశివ రావు తెలంగాణకు పూర్తి వ్యతిరేకం. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారు.

English summary
Karimnagar MP Ponnam Prabhakar said that Guntur MP Rayapati Sambasiva Rao agitating for Seemandhra peoples desire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X