వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ రేసులో సురేష్ రెడ్డి, సోనియాతో బొత్స భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Suresh Reddy i
న్యూఢిల్లీ: శానససభ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభ రేసులో ఉన్నారు. సురేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. దీంతో తెలంగాణ నుంచి సురేష్ రెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేయాలని ముఖ్యమంత్రి కూడా సూచించినట్లు చెబుతున్నారు. కాగా, రాజ్యసభ అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. దీనిపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమై ఈ విషయమై చర్చించారు. రాజ్యసభకు కాగ్రెసు నుంచి నలుగురు ఎన్నికయ్యే అవకాశం ఉంది.

రషీద్ అల్వీ స్థానంలో కర్ణాటకకు చెందిన జాఫర్ షరీప్‌ను గానీ బీహార్‌కు చెందిన షకీల్ అహ్మద్‌ను గానీ నామినేట్ చేయాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి రాజ్యసభ సీటు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. మరో సీటు కోసం తీవ్రంగా పోటీ నెలకొంది. కెఆర్ సురేష్ రెడ్డితో పాటు రేణుకా చౌదరి, వైయస్ వివేకానంద రెడ్డి, వెంకట్రామి రెడ్డి వంటి నాయకులు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణకు చెందిన కె. కేశవ రావు కూడా తీవ్రంగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. తనకు సీటు ఇవ్వడం, ఇవ్వకపోవడంపైనే తెలంగాణపై అధిష్టానం ఏ విధంగా ఆలోచిస్తుందనే విషయం తెలిసిపోతుందని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది.

English summary
It is learnt that Assembly former speaker KR Suresh Reddy is in Rajyasabha race.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X