వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిక్కర్ కిక్‌తో బొత్స, వోటుకు వెయ్యి బాబు: అంబటి ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు పార్టీలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం మండిపడ్డారు. తెలుగుదేశం, కాంగ్రెసులు కూలిపోతున్న సౌధాలు అన్నారు. ఫలితాలు చూసైనా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. ఆ రెండు పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని అన్నారు. టిడిపి, కాంగ్రెసు గజ దొంగలని ఈ ఉప ఎన్నికల ద్వారా ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు. ఆ రెండు పార్టీలతో విసిగిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అందుకే ఓట్ల రూపంలో వారిని తిరస్కరించారన్నారు. చంద్రబాబు నాయుడు తనకు తాను ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారేకు వారసుడిగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గంలో చంద్రబాబు ఓటుకు రూ.వెయ్యి ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ లిక్కర్ కిక్‌లో మాట్లాడుతున్నారని అన్నారు. బొత్స నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో ఓటమికి బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. రానున్న ఎన్నికల్లోనూ తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. తమ పార్టీ అధినే, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుందని, కానీ ప్రజలు వారి తప్పుడు వార్తలను నమ్మడం లేదన్నారు. తప్పుడు కథనాలు రాశారని తెలిసే జగన్‌కు పట్టం కట్టారన్నారు.

English summary
YSR Congress Party spokes person Ambati Rambabu fired at TDP chief Nara Chandrababu Naidu and PCC chief Botsa Satyanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X